అక్కినేని నాగార్జున సోదరిపై కేసు నమోదు..!

అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల పై కేసు నమోదైంది. ఓ భూ వివాదంలో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది..!

అక్కినేని నాగార్జున సోదరి అక్కినేని నాగ సుశీలపై రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. శ్రీజ ప్రకృతి ధర్మపీఠం ట్రస్ట్ సంబంధించిన రెండు ఎకరాల భూ వివాదంలో సుశీలపై పోలీసులు 447,427,504,506 సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైంది. చింతలపూడి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు  ఈ కేసు నమోదైంది. తనపై నాగ సుశీలతో పాటు మరో 12 మంది కలిసి దాడి చేశారని ఫిర్యాదులో సారాంశం.

అయితే.., నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాస్ చాలా ఏళ్ళుగా వ్యాపార భాగస్వాములుగా కొనసాగుతున్నారు. అలానే నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాస్ లు పలు సినిమాలకు నిర్మించారు. శ్రీ నాగ్ ప్రొడక్షన్ పై సుశాంత్ హీరోగా మూడు సినిమాలు కూడా  తీశారు. అందులో కరెంట్ మూవీ తప్ప.. అడ్డా.., ఆటాడుకుందాం సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇవి అలా ఉంటే వీరు మధ్య అప్పటికే భూ వివాదాలు కూడా ఉన్నాయి. అంతేకాక ఈ మధ్య ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నాగ సుశీల చింతలపూడి పై ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా నాగ సుశీల తనపై దాడి చేసిందని ఆరోపిస్తూ చింతలపూడి మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇరువురి కేసులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.