ఏపీలో వేడెక్కిన రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో బాలయ్య భగవంత్ కేసరి మూవీ వాయిదా పడుతోందన్న ఊహాగానాలు మేకర్స్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.

షైన్ స్క్రిన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న చిత్రం భగవంత్ కేసరి.  బాలయ్య ఫుల్ యాక్షన్ రోల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.., అర్జున్ రాంపాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం రీలిజ్ డేట్ పై గత కొంతకాలంగా సందిగ్ధం నెలకొంది.

మేకర్స్ ఈ చిత్రాన్ని దసరా బరిలో దించాలని అక్టోబర్ 19 న డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఏపీ రాజకీయ పరిస్ధితి దారుణంగా మారాయి.  తెలుగు దేశం నేతలందరూ ఇప్పుడు వార్ జోన్ లో ఉన్నారు. అధికార వైసీపీ పై సై అంటే సై అంటూ కాలుదివ్వుతున్నారు. ఈ నేపధ్యంలో హిందూపురం ఎమ్మెల్యే గా ఉన్న బాలయ్య అక్కడి రాజకయాల్లో తలమనకలవుతున్నారు. బావ చంద్రబాబు అరెస్ట్.. అల్లుడు లోకేష్ ఢిల్లీలో బీజీ నేపథ్యంలో బాలయ్య కొంత ఆ పనుల్లో మేకర్స్ టైం కేటాయించలేకపోతున్నారు. అయితే చిత్రం రిలీజ్  కు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్.., ప్రమోషన్ వర్క్.., ఇంటర్వ్యూలు వంటి బాలయ్యతో మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే బాలయ్య వీటిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదంట. దీంతో మేకర్స్ డైలామాలో పడ్డారు.

బాలయ్య దీనిపై స్పందిస్తారని.. చిత్రాన్ని ఎట్టిపరిస్థితిలో అక్టోబరు 19వ తేదీనే రిలీజ్ చేస్తామని మేకర్స్ చేప్తున్నారు. బాలయ్య కూడా దసరా బరిలో ఈ చిత్రం ఉండేలా ఎంతో కష్టపడి ష్యూటింగ్ షెడ్యూల్లో విరామం లేకుండా పాల్గొన్నారని చెప్పారు.

మరోవైపు చిత్రంలోని పెండింగ్ వర్క్స్ అంతా ఫినిష్ చేసుకుని ట్రైలర్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఎట్టిపరిస్ధితిలో అక్టోబరు 19న బాలయ్య బొమ్మ సిల్వర్ స్ర్కిన్ పై పడేలా అన్నీ ఏర్పాట్లును సిద్ధం చేస్తున్నారు.