కష్టాల్లో ఉన్న ఫ్యాన్స్ కు లక్ష రూపాయలు..!

విజయ్ దేవరకొండ,సమంత జంటగా నటించిన ఖుషి మూవీ మాంచి హిట్ టాక్ ను సాధించింది. దీంతోమేకర్స్ ఫుల్ జోష్ లో  ఉన్నారు.

ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ వసూల్ ను బాగానే బాగానే రాబట్టింది, కాకపోతే తెలంగాణ మినహా.. ఏపీలో ఈ సినిమాకు అంతగా కలెక్షన్లు రాలేదు. ఈ నేపథ్యంలో సినిమాకు మాత్రం మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ కష్టాల్లో ఉన్న తన ఫ్యాన్స్ కు విరాళాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు.   వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చెక్కు అందజేయనున్నట్లు ప్రకటించారు.

ఇచ్చిన మాటకు ఫ్యాన్స్ నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు విజయ్ టీం. రెండు దరఖాస్తులకు రెండు వారాలు టైం ఇవ్వడంతో చాలా మంది ఈ ఆఫర్ కు అప్లై చేసుకున్నారు. ఆ ప్రక్రియకు నిన్నటితో  ముగిసింది. అయితే   హైదరాబాదులో జరిగే ఒక ఈవెంట్ కార్యక్రమంలో ఎంపిక చేసిన 100 కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున కోటి రూపాయలు  నగదు చెక్కును  ఫ్యాన్స్ అందజేయనున్నారు విజయ దేవరకొండ.

ఈ కోటి రూపాయలు మొత్తాన్ని  తన రెమ్యూనేషన్ నుంచే తీస్తున్నట్లు ఆయన ఎప్పుడో  ప్రకటించారు.  డియర్ కామ్రేడ్.. లైగర్ సినిమాలు  సిల్వర్ స్క్రీన్ పై  ప్లాప్స్ నమోదు చేసుకుని ఫ్యాన్స్ ను, విజయ్ ను తీవ్ర నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ఖుషి మూవీ హిట్ టాక్ ను సాధించి..  దాన్ని రిప్లేస్ చేసింది. ఈ  సందర్భంగానే ఫుల్ జోస్ లో ఉన్న విజయ్.. ఫ్యాన్స్ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్  పరుశురాం డైరెక్షన్లో  ఒక మూవీ చేస్తున్నారు.  ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.