దుమ్మురేపుతున్న టైగర్ -3 ట్రీజర్..!

యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ ఫిలిం టైగర్ -3 ట్రీజర్ సోషల్ మీడియాలోని అన్ని ఫ్లాట్ ఫామ్స్ పై దుమ్మురేపుతోంది.

ఈ మధ్య యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి పఠాన్ 1,000 కోట్ల సినిమాగా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ యాక్షన్ చిత్రాలకు కేఆర్ఫ్ గా నిలుస్తున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న టైగర్ -3 కూడా మేకర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

విడుదల చేసిన ట్రీజర్ సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు రీచ్ అయ్యేలా ఉంది. ఈ ట్రీజర్ ను చూస్తే చాలు ఈ సినిమా లైన్ పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది.

టైగర్ కా మెసేజ్ అనే పేరుతో విడుదలైన ట్రీజర్ నెట్టింట్లో దుమ్మురేపుతోంది. విడుదల చేసిన క్షణాల్లోనే మిలియన్స్ వీవ్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో సల్మాన్ సీక్రెట్ రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తూ.. దేశం కోసం.. తన కొడుకు కోసం ఎలా పోరాడుతాడో చెప్పేలా ట్రీజర్ లో సన్నివేశాలు ఉన్నాయి. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో వస్తున్న చిత్రం.. వార్.., పఠాన్ సినిమాలకు మించిన యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

దీపావళికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలో షారుక్ కూడా గెస్ట్ రోల్ పాత్ర ఒకటి పోషిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఆ మధ్య పఠాన్ చిత్రంలో సల్మాన్ గెస్ట్ రోల్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో టైగర్ -3 కూడా పఠాన్ మాదిరిగానే 1,000 కోట్ల సినిమాగా నిలవడం ఖాయమన్నట్లు కనిపిస్తోంది. అటు సల్మాన్ అభిమానులతో పాటు షారుక్ అభిమానులకు కూడా ఈ సినిమాపై  భారీ అంచనాలు పెట్టుకున్నట్లు సమాచారం.