నేడు ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలివే..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం జరగనున్నది. కేబినేట్ మీటింగ్ లో అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో గురువారం నుంచి ఐదు రోజులుపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.., పెండింగ్ బిల్లులు.., చంద్రబాబు కేసులు గురించి ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలానే మరిన్ని కేసుల్లో చంద్రబాబును దోషిగా తేల్చే వ్యూహాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరిన్నీ సాక్ష్యాలు గురించి మంత్రివర్గంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. అలానే అసెంబ్లీ ఆమోదించాల్సిన పలు బిల్లులను ముందు ఏపీ కెబినెట్ అమోదించనున్నారు.

ఈ నేపధ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో జైల్లో చంద్రబాబు.., ఢిల్లీ లో లోకేష్ ఉండడంతో అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ పక్ష శాసన సభ్యులు హాజరు అవుతారా..? లేక సమావేశాలకు గైహాజరౌతారా..? అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.