పరారీలో హీరో నవదీప్.. డ్రగ్ కేసులో అనేక మలుపులు..!

టాలీవుడ్ ను డ్రగ్ కేసు కుదిపేస్తోంది. ఈ మధ్య మాదాపూర్ లో ఓ అపార్ట్మెంట్ జరిగిన రేవ్ పార్టీలో దొరికిన డ్రగ్స్ మరోసారి టాలీవుడ్ లో కలకలం రేపుతోంది.

ఇటీవల మాదపూర్ లో నార్కోటిక్స్ బృందం చేసిన  దాడుల్లో డ్రగ్స్ తోపాటు అనేక  సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అక్కడినుంచి లాగిన తీగ.. సినీ.., రాజకీయ.., పారిశ్రామిక రంగాలకు చెందిన అనేక మంది పేర్లు బయటకొస్తున్నాయి. గతంలో డ్రగ్ కేసుతో సంబంధాలున్నట్లు ఆరోపణలపై దర్శకుడు పూరీ.., హీరో రవితేజ.., నవదీప్ వంటి పలువును ఈడీ.., పోలీసు బృందాలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

తాజాగా డ్రగ్ డీలర్స్ తో హీరో నవదీప్ కు సంబంధం ఉన్నట్లు విచారణ తేలింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ఇన్వాల్మెంట్ క్లియర్ ఉందని సీపీ ఆనంద్ వెల్లడించారు. హవాలా మార్గంలో చేస్తున్న నగదు లావాదేవీల ఆధారంగా లాగిన తీగ టాలీవుడ్ లో వేళ్లునుకుపోయిన డ్రగ్ దందా మరోసారి బహిర్గతమైంది.

హవాలా మార్గంలో డ్రగ్స్ ను కొనుగోలు చేసి.. విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో గమనించిన అధికారులు.. ఇందులో ఉన్న 18 మంది ప్రముఖులు కాల్ లిస్ట్.., వాట్సప్ చాటింగ్స్ ను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో హీరో నవదీప్ కు డ్రగ్ డీలర్లతో ఉన్న సంబంధం బయటకొచ్చినట్లు సమాచారం.  ఇప్పటికే నవదీప్ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధాలున్న మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.., టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ మూలాలు ఈ  నాటివి కావు. డ్రగ్స్ వాడకం ఫ్యాషనే కాదు ప్యాషన్ గా భావించే టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు ఈ దందాకు తెరతీస్తున్నారని గాపిప్స్ లేకపోలేదు. అప్పట్లో దర్శకుడు పూరి.., హీరోయిన్స్ చార్మి.., రకుల్ ప్రీత్ సింగ్.., నందు.., రానా..రవితేజా..,నవదీప్ ఈడీ ముందు హాజరై తన డ్రగ్స్ కేసు లింకులపై క్లారిటీ ఇచ్చేలా వాగ్మూలం కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.