రంగంలోకి పవన్ వారాహి..!మరో యాత్రకు శ్రీకారం..!

జనసేనాని  పవన్ కళ్యాణ్ వారాహియాత్ర త్వరలో ప్రారంభంకానున్నది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వారాహి యాత్రను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది పార్టీ.

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి నాలుగోవ విడత యాత్ర త్వరలో ప్రారంభించనున్నట్లు పార్టీ షెడ్యూల్ ను ఖరారు చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్.., టీడీపీతో జనసేన పొత్తు నేపథ్యంలో నాలుగొవ విడత వారాహి యాత్రకు ప్రాధన్యత సంతరించుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీని సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా రూపుదిద్దేలా దూకుడు పెంచుతోంది జనసేన.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నుంచి ఈ ఏడాది జూన్ 14 ప్రారంభమైన జనసేనాని వారాహి యాత్ర కత్తిపూడి మీదిగా ఉమ్మడి గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో సాగింది. ఆ తరువాత ఏలూరు నుంచి రెండు దఫా, మూడో దఫా విశాఖ నుంచి వారాహి యాత్రను ప్రారంభించారు పవన్.

ఈ నేపథ్యంలో నాలుగొవ విడత ఉమ్మడి కృష్ణ జిల్లా నుంచి ప్రారంభించే వారాహి యాత్రకు ప్రధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు అరెస్ట్.., టీడీపీతో జనసేన పొత్తు నేపథ్యంలో సాగుతున్న పవన్ యాత్రకు ఇరుపార్టీ శ్రేణులు సమాయక్తం అవుతున్నాయి. ఈ యాత్రతో వైసీపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించనున్నాయి ఇరు పార్టీలు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంటూ నినదిస్తూ ఆ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని ఆపార్టీ సీనియర్ నాయకులు నాగాబాబు ఆదివారం తిరుపతిలో శ్రేణులకు పిలుపు నిచ్చారు. అలానే ఇరు పార్టీలు కలిసికట్టుగా వైసీపీపై పోరాడాలని కోరారు.