రేపు సాయంత్రం ఏపీలో మోతమోగిద్ది..!

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు.

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు ప్లేటు.., గరిటెలతో శబ్ధం చేయాలని ఏపీ ప్రజలను కోరారు. ఇంట్లో ఉంటే ప్లేటుతో శబ్ధం చేసి నిరసన వ్యక్తం చేయాలని ట్విట్టర్లో లోకేష్ విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు తో పాటు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలను కోరారు.

అక్రమ అరెస్ట్ లు చేస్తే ప్రజా ఆగ్రహం ఎలా ఉంటుందో.. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గేదేమి లేదు అని నిరూపించాలంటే ప్రజలు బయటకు రావాలని నారా లోకేష్ ట్విట్టర్ లో కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రేపు(శనివారం) సాయంత్ర ప్రజా శబ్ధాన్ని తాడేపల్లి వరకు వినిపించాలని పిలుపునిచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననాలని పిలుపు నిచ్చారు. అలానే రోడ్డుపై ఉన్న వారంతా బైక్.. కారు .. హారన్ ను మోగిస్తూ మద్దతు తెలపాలని కోరారు. ఇంట్లో ఉన్న వారు ప్లేటును గరిటెతో కొట్టి శబ్థం చేసి చంద్రబాబుకు మద్దతు తెలపాలన్నారు. ప్రజలు చేసి శబ్ధం తాడేపల్లి వరకు చేరాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.