వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు..!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వాహన సేవలు భక్తులకు దర్శనమిస్తున్న కలియుగవాసుడిని దర్శించి భక్తులు తరిస్తున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడు రోజు స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై మాడవీధుల్లో ఊరెగుతూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతున్నారు. స్వామి వారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. స్వామి వారి వాహన సేవ ముందు మహిళా భక్తులు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

అయితే.., గురువారం కల్పవృక్ష వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు బంగారు కల్పవృక్ష వాహన సేవలో మాఢవీధుల్లో విహరించారు. అలానే సాయంత్రం సర్వభూపాల వాహనంపై స్వామి వారు భక్తులను అనుగ్రహించనున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్నీ ఏర్పాట్లును చేస్తున్నారు.