శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షకుంకుమార్చన

తిరుపతి కపిలేశ్వరాలయంలో లక్షకుంకుమార్చన దివ్య క్రతువును వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు.

శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కావడంతో ఆలయంలో కొలువుదీరిన శ్రీ కామాక్షి అమ్మవారికి వేకుజామునుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజాది కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నుంచే గణపతి పూజ.., పుణ్యాహవచనం.., విశేష అభిషేకాలు వేదోక్తంగా నిర్వహించారు.

అనంతరం పెద్దసంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తుల సమక్షంలో అమ్మకు వేద మంత్రోచ్ఛణలు నడుమ కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం సాయంత్ర వేళ దేవతమూర్తులను స్థానిక పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాలను ఆలయ డిప్యూటీ ఈవో  దేవేంద్రబాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి తదితరులు పర్యవేక్షించారు.