color photo producer, Sita Ramam : మారింది జనం టేస్ట్.. మారాల్సింది ఇండస్ట్రీ ఫేట్.. ‘కలర్ ఫోటో’ నిర్మాత ట్వీట్ వైరల్ – color photo producer sai rajesh about success of bimbisara and sita ramam

0


టాలీవుడ్‌కు ఈ శుక్రవారం బాగా కలిసి వచ్చింది. విడుదలైన రెండు చిత్రాలు బింబిసార (bimbisara), సీతారామం (sita ramam) రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి. ఒకటి క్లాస్ సినిమా కాగా.. రెండోది మాస్ సినిమా. ఇలా మొత్తానికి చాల ా రోజుల తరువాత ఓ శుక్రవారం ఇంత పాజిటివ్‌గా గడిచింది. దీంతో ఎంతో మంది సెలెబ్రిటీలు సంబరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీకెండ్ బాక్సాఫీస్ కళకళలాడుతుందని అర్థమవుతోంది.

అయితే జనాలు థియేటర్లకు రావడం లేదు అని అందరూ అంటున్నారు. అది అబద్దమని, మంచి సినిమాలు వస్తే కచ్చితంగా జనాలు థియేటర్లకు వస్తారని విక్రమ్, మేజర్ వంటి చిత్రాలు నిరూపించాయి. ఇక ఇప్పుడు బింబిసార, సీతారామం వంతు వచ్చింది. ఈ రెండు చిత్రాలు జనాలను కదిలిస్తున్నాయి.

ఇదే విషయం మీద కలర్ ఫోటో నిర్మాత సాయి రాజేష్ కాస్త ఘాటుగా స్పందించాడు. ఈ మధ్యే కలర్ ఫోటో సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. కలర్ ఫోటో నిర్మాతగా సాయి రాజేష్ తన ఆనందాన్ని కూడా పంచుకున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం బింబిసార, సీతారామం సక్సెస్‌ల మీద స్పందించాడు. ఇండస్ట్రీ మీద సున్నితంగా సెటైర్లు వేశాడు.

షూటింగ్‌లు బంద్ చేయడం మీదా కౌంటర్లు వేశారు. ఆయన వేసిన ట్వీట్‌లో ఏముందంటే.. ‘జనాలు రావడం లేదని షూటింగ్ ఆపేశారు.. రెండు హిట్లు పడ్డాయ్ ఒకే రోజు.. మారింది జనం టేస్ట్.. మారాల్సింది ఇండస్ట్రీ ఫేట్.. ఇంకా అర్థంకాకపోతే వేస్ట్’ అని ట్వీట్ వేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *