న్యూజిలాండ్ లో శరవేగంగా ష్యూటింగ్ జరుపుకుంటున్న ‘కన్నప్ప’ చిత్రం సెట్ లో మంచు విష్ణుకు గాయాలైనట్లుగా వార్తలు వైరల్ గా మారాయి.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘కన్నప్ప’ చిత్రం ప్రస్తుతం ష్యూటింగ్ షెడ్యూల్ నూజిలాండ్ జరుగుతోంది. దర్శకులు ముఖేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను న్యూజిలాండ్ లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా డోన్ కెమెరాలు అదుపుతప్పి విష్ణు చేతికి తాకగా గాయాలు అయిన్నట్లు అందుతున్న సమాచారం. దీంతో  ష్యూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పాన్ ఇండియా స్థాయి చిత్రం ‘కన్నప్ప’. ‘కన్నప్ప’ భక్తిని నేటి తరాలకు అర్థమయ్యే రీతిలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ను న్యూజిలాండ్ కు తరలించారు. ఆరు నెలలు పాటు ఇక్కడే చిత్రీకరణ జరగనున్నది. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సిద్ధం చేస్తున్న చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయన సరసన లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్  పాత్రలో.., కన్నడ హీరో శివరాజ్ కుమార్,మలయాళీ మెగాస్టార్ మోహన్ లాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ లు రచయితలుగా వ్యవహరిస్తుండగా.., మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు. ఆరు నెలలుపాటు ష్యూటింగ్ ముగిసిన తరువాత ఇండియాలోని కొన్నిప్రాంతాల్లో ష్యూటింగ్ జరపనున్నది చిత్ర యూనిట్. అయితే మంచు విష్ణు చేతికి గాయం కావడంతో ష్యూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమౌతోందో అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.