తక్కువ అంచన వేస్తున్నారు..!తట్టుకోలేరు..!

తెలుగు దేశం పార్టీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును తక్కువ అంచన వేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతో చెలగాటం ఆడుతున్నారని  హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో చంద్రబాబును ఎదుర్కోలేకే అక్రమ కేసులతో జైలు పాలు చేశారని.., అలా చేసినా జగన్ రెడ్డికి కక్ష చల్లారలేదని మండిపడ్డారు.

గత నాలుగు రోజులుగా చంద్రబాబు ఆరోగ్యం జైల్లో క్షీణిస్తోంది. దీనిపై తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దఎత్తున నిరసన బాటపడుతున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు అనారోగ్యంపై బాలయ్య స్పందించారు. ఫేక్ హెల్త్ రిపోర్ట్లను సృష్టించి మభ్య పెట్టాలని చూస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వైద్యం అందించేందుకు వ్యక్తిగత వైద్యులను సలహాలు తీసుకుని వైద్య సేవాలని అందించాలని, ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.   చంద్రబాబుకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డే తీసుకోవాల్సి వస్తుంది  ఆయన వ్యాఖ్యానించారు.

రాజమండ్రి ప్రభుత్వ సూపరింటెండెంట్ హెల్త్ రిపోర్ట్ లు ఇవ్వటం లేదని.. ఇది జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు హెల్త్ రిపోర్టును రాస్తున్నారని.. ఆ అధికారం మీకెవరిచ్చారని మండిపడ్డారు.

సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును శారీరకంగా హింసించి దొంగ రిపోర్టు ఇచ్చినట్లు చంద్రబాబు విషయంలో కూడా చేస్తున్నారని ఆయన వాపోయారు. చంద్రబాబు జగన్ లా  అవినీతిపరుడు.., పలు కేసులో ముద్దాయి కాదని.. ఏపీ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అని గుర్తు చేశారు. 36 రోజులుగా చంద్రబాబును  జైల్లో ఉంచినా..జగన్ కు  ఇంకా పక్క  పగ చల్లారలేదని చెప్పుకోచ్చారు.