హీరో సాయి ధరమ్ తేజ్ నిర్ణయం ఆదర్శప్రాయం..!

హీరో సాయి ధరమ్ తేజ్ తన పుట్టిన రోజు సందర్భంగా అందరి ప్రశంసలు అందుకునేలా ఆదర్శప్రాయ నిర్ణయం తీసుకున్నారు.

ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా మంచి పని చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ అధికారుల భార్యలకు 10 లక్షలు, తెలుగు రాష్ట్రాల పోలీసులకు  రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. మొత్తంగా రూ. 20 లక్షల ను అందించి పుట్టిన రోజున దేశ సేవలో తానూ  పాలు పంచుకు న్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకునున్నారు.

నా జీవితంలో ఒక సంవత్సరం ముందుకు వెళ్తున్నాను. ఈ సందర్భంగా తీసుకుంటున్న కీలక నిర్ణయానికి అభిమానులను మద్దతు కావాలి. నా పుట్టిరోజున వీరనారీ మణులకు అంటే ఆర్మీ లో ఉంటూ మన భవిష్యత్తు, దేశ రక్షణ కోసం ప్రాగ త్యాగం చేసిన సైనికుల భార్యలకు రూ. 10 లక్షలు, రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు విరాళంగా మరో రూ.10 లక్షలు ప్రకటిస్తున్నాని ఆయన లెటర్ ను పోస్ట్ చేశారు.  

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తేజ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు ప్రశంసిస్తున్నారు.