అంబటి రాంబాబుపై దాడి..! కర్రలతో వెంబడించి టీడీపీ నాయకులు..!

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి యత్నించారు ఖమ్మం టీడీపీ నాయకులు. దీంతో ఒక్కసారిగా తెరుకున్న భద్రత సిబ్బంది అంబటి రాంబాబు కాన్వాయిని అక్కడ నుంచి దూరంగా తీసుకుపోయారు.

అంబటి రాంబాబుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టపగలే చుక్కలు చూపించారు.  ఖమ్మం నడిబొడ్డున దాడికి యత్నించారు. స్ధానికంగా ఉన్న తెలుగు దేశం పార్టీ నేతలు అంబటి రాంబాబుపై కర్రలు తీసుకుని దాడి చేసేందకు ప్రయత్నించారు. పరుష పదజాలంతో దూషిస్తూ.. వైసీపీ డౌన్ డౌన్.., జగన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ఒకవైపు తెలంగాణలో ఎన్నికలు వేడితో రాజకీయాలు అట్టుడికిపోతున్న వేళ.. ఖమ్మంలో అనూహ్య పరిస్ధితి నెలకొంది. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యి.., అంబటిని రక్షించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కేసీఆర్ ప్రజాశ్వీరాద సభ ప్రారంభానికి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపుతోంది. అంబటి ప్రయాణిస్తున్న కాన్వాయిని అడ్డుకుని కర్రలతో దాడికి యత్నించారు స్థానిక తెలుగు దేశం యత్నించారు.  

తెలంగాణ టీడీపీ నాయకులతో అంబటి వాగ్వివాదానికి దిగారు. పోలీసులు, ఆయన వ్యక్తిగత సిబ్బంది టీడీపీ నేతలను వారించి .. అంబటిని కారు ఎక్కించి తీసుకుపోయే క్రమంలో కూడా కారును వెంబడించి మరి దాడికి యత్నించారు. జై చంద్రబాబు.. జైజై తెలుగు దేశం అంటూ నినాదాలు చేస్తూ కర్రలు చూపుతూ రెచ్చిపోయారు తెలంగాణ టీడీపీ నేతలు. ఈ దాడిని ఏపీ వైసీపీ నేతలు ఖండించారు. ఈ ఘటనతో ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.